Samantha: ముంబై‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన హీరోయిన్.. ధర వింటే షాకే..!

ABN , First Publish Date - 2023-02-08T15:14:40+05:30 IST

సమంత (Samantha) మయోసైటిస్ నుంచి కోలుకొని వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘సిటాడెల్’ (Citadel) సెట్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ ఎక్కువ శాతం ముంబై పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతుంది.

Samantha: ముంబై‌లో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన హీరోయిన్.. ధర వింటే షాకే..!

సమంత (Samantha) మయోసైటిస్ నుంచి కోలుకొని వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ మధ్యనే ‘సిటాడెల్’ (Citadel) సెట్లోకి అడుగుపెట్టారు. షూటింగ్ ఎక్కువ శాతం ముంబై పరిసర ప్రాంతాల్లోనే కొనసాగుతుంది. అందువల్ల సామ్ అక్కడ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ అపార్ట్‌మెంట్ విలువ కోట్లలోనే ఉంటుందని సమాచారం అందుతుంది.

సమంత కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులకు కూడా సంతకం చేశారు. అందువల్ల ముంబైలో 3 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను కోనుగోలు చేశారని వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఈ అపార్ట్‌మెంట్ కోసం దాదాపుగా రూ.15కోట్లను వెచ్చించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సామ్ ‘సిటాడెల్’ టీమ్‌తో జరుపుతున్న చర్చలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ ముంబై అపార్ట్‌మెంట్‌లో తీసుకున్నావేనని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘సిటాడెల్’ కు ఫ్యామిలీమ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. వరుణ్ ధావన్, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో వీరిద్దరూ గూఢచారులుగా కనిపించనున్నారు.

సమంత ప్రస్తుతం ‘ఖుషి’ (Kushi) లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరో పాత్రను పోషిస్తున్నారు. సామ్ అనారోగ్యం కారణంగా ఈ మూవీ షూటింగ్ కొంతకాలంగా ఆగిపోయింది. ‘శాకుంతలం’ (Shaakuntalam) లోను నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కావాలి. కానీ, మూవీ రిలీజ్‌ను పోస్ట్‌పోన్ అయింది. మేకర్స్ త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నారు. బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌తో ఓ సినిమా, అక్షయ్ కుమార్‌తో మరో ప్రాజెక్టుకు సామ్ ఇప్పటికే ఒకే చెప్పారట. కానీ, ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు.

Updated Date - 2023-02-08T15:17:39+05:30 IST