Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

ABN , First Publish Date - 2023-02-11T16:37:37+05:30 IST

'కాంతార’ (kanthara) చిత్ర దర్శకుడు రిషబ్‌శెట్టిపై పరోక్షంగా చేసిన కామెంట్లు, అలాగే దక్షిణాది పాటలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేషనల్‌ క్రష్‌గా(National crush) పేరొందిన రష్మిక మందన్నా (Rashmika mandanna) ట్రోల్‌ అవుతూనే ఉంది.

Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

'కాంతార’ (kanthara) చిత్ర దర్శకుడు రిషబ్‌శెట్టిపై పరోక్షంగా చేసిన కామెంట్లు, అలాగే దక్షిణాది పాటలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేషనల్‌ క్రష్‌గా(National crush) పేరొందిన రష్మిక మందన్నా (Rashmika mandanna) ట్రోల్‌ అవుతూనే ఉంది. తరచూ వార్తలో నిలుస్తూనే ఉంది. ఈ మధ్యన రష్మిక బాలీవుడ్‌లో కూడా బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలొచ్చాయి. (rashmika counter to Netizens) తాజాగా రష్మిక గురించి ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కథానాయికగా కెరీర్‌ ప్రారంభించిన ఐదేళ్లల్లో రష్మిక.. కూర్గ్‌, ముంబై, హైదరాబాద్‌, గోవా, బెంగళూరు నగరాల్లో ఐదు ఖరీదైన ఇళ్లను ఆమె కొన్నట్లు ఈ ట్వీట్‌లో ఉంది. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. ఆ ట్వీట్‌లో నిజం లేదన్నారు ఇలాంటి వార్తలు ఎవరు సృష్టింస్తున్నారో తెలీదు కానీ ఆ వార్తలు నిజమైతే బావుండును’’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పుష 2’ (pushpa2)చిత్రంతో బిజీగా ఉంది.

Updated Date - 2023-02-11T16:39:21+05:30 IST