Vaarasudu : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘వారసుడు’?.. ప్రచారంపై స్పందించిన మూవీ టీం

ABN , First Publish Date - 2023-01-08T13:45:38+05:30 IST

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’ పేరుతో విడుదల కానుంది.

Vaarasudu : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘వారసుడు’?.. ప్రచారంపై స్పందించిన మూవీ టీం
Vaarasudu

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’ పేరుతో విడుదల కానుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలోని రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. సక్సెస్‌ఫుల్ దర్శక నిర్మాతలు కావడం.. అందులో స్టార్ హీరో నటిస్తుండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులని భారీ అంచనాలు ఉన్నాయి.

vijay.jpg

ఈ తరుణంలో ఈ మూవీ గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కాకపోవడంతో ‘వారసుడు’ చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తాజాగా ఈ న్యూస్ చిత్రబ‌ృందం సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రం విడుదల అవుతుందని, పుకార్లను నమ్మవద్దంటూ పోస్టర్‌ను విడుదల చేసింది. మూవీ టీం షేర్ చేసిన ట్వీట్‌లో.. ‘మీ దగ్గరలోని థియేటర్లలో 3 రోజుల్లో బాస్ కుటుంబాన్ని కలుసుకోండి’ అని రాసుకొచ్చింది. అలాగే.. ఈ మూవీ పోస్టర్‌ని కూడా జత చేస్తూ, దానిపై మూడు రోజుల్లో అని రాసుకొచ్చింది. దీంతో రూమర్స్‌కి చెక్ పెట్టినట్లైంది.

Updated Date - 2023-01-08T13:45:40+05:30 IST