News anchor Lisa: భారత్‌లో ఇలాంటి యాంకర్ వార్తలు చదవడం ఇదే తొలిసారి.. వీడియో తెగ వైరల్

ABN , First Publish Date - 2023-07-10T14:24:30+05:30 IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం..ఇప్పుడు ఇది చాలారంగాల్లో వాడుకలో ఉంది. ఈ టెక్నాలజీ రూపకల్పనలో వార్తలు చదివే న్యూస్ యాంకర్ల ను కూడా తీసుకొచ్చింది. ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ వచ్చేశారు. తాజాగా ఒడిశాలో ఓ న్యూస్ ఛానెల్.. AI ప్రెజెంటర్‌ను పరిచయం చేసింది. ఒడిశాకు చెందిన ఓ ప్రైవేట్ శాటిలైట్ న్యూస్ ఛానెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన మొదటి వర్చువల్ న్యూస్ ప్రజెంటర్‌ను భువనేశ్వర్‌లో ప్రారంభించింది.

News anchor Lisa: భారత్‌లో ఇలాంటి  యాంకర్ వార్తలు చదవడం ఇదే తొలిసారి.. వీడియో తెగ వైరల్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం.. ఇప్పుడు ఇది చాలారంగాల్లో వినియోగంలోకి వచ్చింది. ఈ జాబితాలో మీడియా రంగం కూడా ఉంది. తాజాగా ఇండియాలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ వచ్చేశాయి. తాజాగా ఒడిశాలో ఓ న్యూస్ ఛానెల్.. AI ప్రెజెంటర్‌ను పరిచయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన మొదటి వర్చువల్ న్యూస్ ప్రజెంటర్‌ వార్తలు చదివింది.


ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యూస్ యాంకర్లను విదేశాల్లో మాత్రమే చూశాం. అయితే తాజాగా దేశీయ AI యాంకర్లు వచ్చేశారు. తాజాగా.. ఒడిశాలోని ప్రైవేట్ ఛానెల్.. భారతీయ AI న్యూస్ యాంకర్‌ ‘లీసా’ను ప్రవేశపెట్టింది. ఒడిశా సంప్రదాయ చేనేత చీర ధరించిన లీసా మహిళా వేషధారణలో న్యూస్ యాంకర్‌లా కనిపిస్తూ వార్తలు చదువుతోంది.

ఒడియా, ఇంగ్లీషులో వార్తలు చదివే లీసా.. టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రధాన యాంకర్‌గా వ్యవహరిస్తుందని కంపెనీ తెలిపింది. లిసా అనేక భాషలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం లీసా న్యూస్ రీడింగ్ ఒడియా, ఇంగ్లీషులో ఉంటుంది. ఒడియా టెలివిజన్ మీడియాలో లిసా ప్రదర్శన ఆసక్తిగా మారింది. వార్తాప్రసార రంగం.. కొత్త యుగంలోకి ప్రవేశించిందా అనే చర్చలకు దారి తీసింది.


కాగా.. 2018లో చైనాకు చెందిన జిన్హువా వార్తా సంస్థ ప్రపంచంలోనే మొదటి ఏఐ సాంతికేకతతో న్యూస్ యాంకర్‌ను ప్రవేశపెట్టింది. అచ్చు మనుషులను పోలి, పురుషుల స్వరాలతో న్యూస్ యాంకర్ వార్తాలు చదువుతోంది. అయితే ఇండియాలో కూడా న్యూస్ 18 తెలుగు, CNBC, ఇండియా టుడే ఇలాంటి యాంకర్లను తెచ్చాయి.

లీసా ఏఐ, ఎల్‌ఎల్‌ఎమ్ టెక్నాలజీతో సమర్థవంతంగా వార్తలను అందజేస్తోందని ఓటీవీ మేనేజింగ్ డైరెక్టర్ జగి మంగత్ పాండా తెలిపారు. తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్‌ను పరిచయం చేయడం ద్వారా తమ ఛానల్ జర్నలిజం రంగంలో ఓ మైలురాయిని చేరిందని పేర్కొన్నారు.

Updated Date - 2023-07-10T14:56:26+05:30 IST