Akkineni Nagarjuna: తండ్రి కొడుకులతో వందో సినిమా

ABN , First Publish Date - 2023-02-21T16:59:40+05:30 IST

ప్రస్తుతం 'ధమాకా' (#Dhamaka) రచయిత ప్రసన్న కుమార్ (Prasanna Kumar) కథ విని అతని దర్శకత్వం లో చేయబోతున్న అక్కినేని నాగార్జున (#AkkineniNagarjuna), రాబోయే తన వందో సినిమా మాత్రం స్పెషల్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు.

Akkineni Nagarjuna: తండ్రి కొడుకులతో వందో సినిమా

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తన తదుపరి సినిమాకి సమాయత్తం అవుతున్నారు. ఇంతకు ముందు 'ది ఘోస్ట్' (The Ghost) అనే సినిమా విడుదల అయింది, కానీ అది పెద్దగా నడవలేదు. తరువాత బిగ్ బాస్ రియాలిటీ (Bigg Boss reality show) షో హోస్ట్ గా మాత్రం నాగార్జున విజయం సాధించారనే చెప్పాలి. అయితే 'ది ఘోస్ట్' తరువాత నాగార్జున కొంచెం టైం తీసుకొని సినిమా మొదలెడదాం అనుకున్నారేమో, అందుకని ఈసారి ఒక మంచి కథతో వస్తేనే చెయ్యాలి అని ఆగారు. 'ధమాకా' (Dhamaka) సినిమా రచయిత ప్రసన్న కుమార్ (Prasanna Kumar) నాగార్జున ని కలిసి ఒక కథ చెప్పి ఒప్పించారు. ప్రసన్న దర్శకత్వం లో నాగార్జున ఇప్పుడు సినిమా చేస్తున్నారు, అది మొదలవ్వాలి.

akkineni-nag1.jpg

ఇదిలా ఉంటే, నాగార్జున తనయుడు అఖిల్ (Akhil Akkineni) తన 'ఏజెంట్' (#AgentMovie) సినిమా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఆ సినిమా క్లైమాక్స్, ఒక పాట మినహా మొత్తం పూర్తి అయింది (#Agent). సురేందర్ రెడ్డి (Surender Reddy) దీనికి దర్శకుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి (Mammootty) ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ అవగానే నాగార్జున తన వందో సినిమా కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు అని పరిశ్రమలో వినికిడి. చిరంజీవితో (MegaStar Chiranjeevi) 'గాడ్ ఫాదర్' (#GodFather) చేసిన దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) నాగార్జున కి ఒక కథ వినిపించాడని, అందులో అఖిల్ అక్కినేని కూడా నటించబోతున్నారని తెలిసింది. అయితే ఈ కథ నాగార్జున తన వందో సినిమాగా చెయ్యాలని చూస్తున్నారని తెలిసింది. మోహన్ రాజా ఈలోపు మొత్తం స్క్రిప్ట్ పని పూర్తి చేసి వస్తాడని ఇది స్పెషల్ సినిమాగా నాగార్జున, అఖిల్ తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-02-21T16:59:41+05:30 IST