భార్యను తీసుకెళ్లిపోయిన ప్రియుడి తిక్క కుదిర్చిన భర్త.. అతడి భార్య ఫోన్ నెంబర్‌ను సంపాదించి పెళ్లి ప్రపోజల్.. చివరకు..

ABN , First Publish Date - 2023-02-27T19:13:34+05:30 IST

ఆ వ్యక్తి భార్య తన ప్రియుడితో కలిసి పారిపోయాడు. దీంతో ఆ వ్యక్తి అద్భుతమైన స్కెచ్ వేసి భార్యకు, అమె ప్రియుడికి తిక్క కుదిర్చాడు.

భార్యను తీసుకెళ్లిపోయిన ప్రియుడి తిక్క కుదిర్చిన భర్త.. అతడి భార్య ఫోన్ నెంబర్‌ను సంపాదించి పెళ్లి ప్రపోజల్.. చివరకు..

నలుగురి పిల్లల తల్లి అయిన ఓ మహిళ భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. ఆ మహిళ భర్త అద్భుతమైన స్కెచ్ వేసి ఇద్దరికీ తిక్క కుదిర్చాడు. తన భార్యను తీసుకెళ్లిపోయిన వ్యక్తి భార్యను ప్రేమలోకి దించి పెళ్లి వరకు తీసుకెళ్లాడు.

బీహార్‌లో (Bihar) ఓ ఆశ్చర్యకర కేసు వెలుగులోకి వచ్చింది. ఖగారియాకు చెందిన నీరజ్ కుమార్ అనే వ్యక్తి భార్య రూబీ దేవి తన ప్రేమికుడితో పారిపోయింది (Married woman eloped with lover). నలుగురు పిల్లలను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింది. కనిపించకుండా పోయిన భార్య, పిల్లల కోసం నీరజ్ ఎంతగానో వెతికాడు. చివరకు రూబీ తన ప్రియుడు ముఖేష్ కుమార్‌తో పారిపోయిందని తెలుసుకున్నాడు. ముఖేష్ కుమార్ వివరాలు తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లాడు. ముఖేష్ భార్య పేరు కూడా రూబీ అని, ఆమెకు ఇద్దరు పిల్లలు అని తెలుసుకున్నాడు. భర్త కనిపించకపోవడంతో ఆమె కూడా విషాదంలో మునిగిపోయింది. ఇద్దరూ ఒకర్నొకరు ఓదార్చుకున్నారు. భాగస్వాములు చేసిన మోసాలను ఇద్దరూ భరించలేకపోయారు.

మీరు రావాల్సిన అవసరం లేదంటూ కొద్ది గంటల్లో పెళ్లనగా వరుడికి ఫోన్ చేసిన వధువు తండ్రి.. కారణమేంటని నిలదీస్తే..

ఇద్దరూ మొబైల్ నెంబర్లు మార్చుకుని తరచుగా మాట్లాడుకునేవారు. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు (Extra Marital Affair). పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఫిబ్రవరి 11న వారి ఇళ్ల నుంచి పారిపోయి ఫిబ్రవరి 18న కోర్టులో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నీరజ్ భార్య, పిల్లలు ముఖేష్ దగ్గర ఉంటే, ముఖేష్ భార్య, పిల్లల నీరజ్ నీడలో ఉన్నారు. ఈ వివాహాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2023-02-27T19:13:35+05:30 IST