Metro trains: వామ్మో.. ఒక్క నెలలో అంతమంది ప్రయాణమా..

ABN , First Publish Date - 2023-06-02T09:15:35+05:30 IST

నగరంలో నడుపుతున్న మెట్రోరైళ్లలో(Metro trains) మే నెలలో 72.68 లక్షల మంది ప్రయాణించారు. ఈ మేరకు చెన్నై మెట్రోరైల్‌ లిమి

Metro trains: వామ్మో.. ఒక్క నెలలో అంతమంది ప్రయాణమా..

పెరంబూర్‌(చెన్నై): నగరంలో నడుపుతున్న మెట్రోరైళ్లలో(Metro trains) మే నెలలో 72.68 లక్షల మంది ప్రయాణించారు. ఈ మేరకు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) విడుదల చేసిన ప్రకటనలో, మెట్రోరైళ్లలో ఈ ఏడాది జనవరిలో 66.07 లక్షలు, ఫిబ్రవరిలో 62.69 లక్షలు, మార్చిలో 69.99 లక్షలు, ఏప్రిల్‌లో 66.85 లక్షల మంది, మే నెలలో 72.68 లక్షల మంది ప్రయాణం చేశారని తెలిపింది. మే నెల 24వ తేది అత్యధికంగా 2.64 లక్షల మంది ప్రయాణించారని వెల్లడించింది. గత నెలలో 26.76 లక్షల మంది క్యూఆర్‌ కోడ్‌ టిక్కెట్టు విధానంలోను, 3.61 లక్షల మంది టోకెన్లు, 6,218 మంది గ్రూప్‌ టిక్కెటింగ్‌ సిస్టమ్‌, 5,138 మంది సింగార చెన్నై కార్డుతో ప్రయాణం చేశారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో 5.82 లక్షల మంది అధికంగా ప్రయాణించారని సీఎంఆర్‌ఎల్‌ తెలియజేసింది.

Updated Date - 2023-06-02T09:15:35+05:30 IST