Kantara 2: కాంతార సినిమాకు ప్రీక్వెల్: విజయ్ కిరంగదూర్

ABN , First Publish Date - 2023-01-21T15:04:50+05:30 IST

‘కాంతార 2’ (Kantara 2) ఉంటుందని కొన్నాళ్ల క్రితమే హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur) చెప్పాడు. కానీ, రెండో భాగం.. సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని తాజాగా తెలిపాడు. రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిఫ్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టాడని పేర్కొన్నాడు.

Kantara 2: కాంతార సినిమాకు ప్రీక్వెల్: విజయ్ కిరంగదూర్

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’ (Kantara). సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. హోంబలే ఫిలిమ్స్ రూ.16కోట్ల బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించగా వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘కాంతార 2’ (Kantara 2) ఉంటుందని కొన్నాళ్ల క్రితమే హోంబలే అధినేత విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur) చెప్పాడు. కానీ, రెండో భాగం.. సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని తాజాగా తెలిపాడు. రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిఫ్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టాడని పేర్కొన్నాడు.

కాంతార ప్రీక్వెల్‌లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని విజయ్ కిరంగదూర్ తెలిపాడు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద ఆవిష్కరిస్తామని పేర్కొన్నాడు. ‘‘సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరం. అందువల్లే మూవీ షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేయాలని ఆలోచిస్తున్నాం. ‘కాంతార’ లో చూపించిన జానపదాన్ని అర్థం చేసుకోవడానికి రిషబ్ కర్ణాటక కోస్తా తీర ప్రాంతాల్లోని అడవుల్లో ప్రస్తుతం రెక్కీ నిర్వహిస్తున్నాడు. రెండో భాగానికి బడ్జెట్‌ను పెంచాం. కొత్తగా నటీనటులను కూడా తీసుకోబోతున్నాం’’ అని విజయ్ కిరందూర్ స్పష్టం చేశాడు. కాంతార సినిమా మొదటగా కన్నడలో విడుదలయింది. అనంతరం సంచలన విజయం సాధించడంతో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలోకి మేకర్స్ డబ్ చేశారు. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి రికార్డులను తిరగరాయడమే పనిగా పెట్టుకుంది.

Updated Date - 2023-01-21T15:04:51+05:30 IST