Padma Awards 2023: తెలుగు రాష్ట్రాల పద్మాలు వీళ్లే..

ABN , First Publish Date - 2023-01-25T22:42:13+05:30 IST

విభిన్న రంగాల్లో ప్రతిభపాఠవాలతో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని 2023- పద్మ అవార్డులతో (Padma Awards 2023) సత్కరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు. అందులో తెలుగువారు ఎవరంటే..

Padma Awards 2023: తెలుగు రాష్ట్రాల పద్మాలు వీళ్లే..

న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ప్రతిభపాఠవాలతో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని 2023- పద్మ అవార్డులతో (Padma Awards 2023) సత్కరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించిన ఈ జాబితాలో 9 మందికి పద్మ విభూషన్, 9 మందికి పద్మ భూషన్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పలువురు ప్రముఖలు ఉన్నారు.

తెలంగాణ పద్మాలు వీరే..

Untitled-8.jpg

పద్మభూషణ్ గ్రహీతలు

1. చిన్నజీయర్ స్వామి - ఆధ్యాత్మిక

2. కమలేష్ డి పటేల్ - ఆధ్మాత్మిక

పద్మశ్రీ గ్రహీతలు..

1. మోదడుగు విజయ్ గుప్తా - సైన్స్ రంగం

2. పసుపులేటి హనుమంతరావు - వైద్య రంగం

3. బీ.రామకృష్ణా రెడ్డి - విద్యా సాహిత్యం.

ఆంధ్రప్రదేశ్ పద్మాలు వీరే..

1. ఎంఎం కీరవాణి (సంగీతం)

2. కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ)

3. ప్రకాష్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య)

4. గణేష్ నాగప్ప (సైన్స్, ఇంజనీరింగ్)

5. సీవీ రాజు (కళలు)

6. అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్, ఇంజనీరింగ్)

7. సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ).

Updated Date - 2023-01-25T23:54:33+05:30 IST