Corporation: ఇక ఆ పనులు రాత్రి వేళల్లోనే చేస్తారట..

ABN , First Publish Date - 2023-06-02T12:31:38+05:30 IST

వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా రాత్రి వేళల్లో పారిశుధ్య పనులు చేపట్టనున్నట్లు తాంబరం కార్పొరేషన్‌(Tambaram Corpor

Corporation: ఇక ఆ పనులు రాత్రి వేళల్లోనే చేస్తారట..

ఐసిఎఫ్‌(చెన్నై): వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా రాత్రి వేళల్లో పారిశుధ్య పనులు చేపట్టనున్నట్లు తాంబరం కార్పొరేషన్‌(Tambaram Corporation) తెలిపింది. ఈ కార్పొరేషన్‌ పరిధిలోని పెరుంగళత్తూర్‌ నుంచి పల్లావరం జీఎస్‏టీ రోడ్డు, ముడిచ్చూర్‌, తాంబరం మార్కెట్‌, తిరునీర్‌మలై, పమ్మల్‌ ప్రాంతాల్లో సుమారు 38 మెట్రిక్‌ టన్నుల చెత్త తొలిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేసవి ఎండలు, ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో ఉంచుకొని రాత్రి వేళల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు 60 మంది కార్మికులను నియమించామన్నారు.

Updated Date - 2023-06-02T12:31:38+05:30 IST