Coconuts: తలపై పగిలిన టెంకాయలు
ABN , First Publish Date - 2023-02-21T11:18:53+05:30 IST
దిండుగల్ జిల్లా వలయపాడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు తమ తలలపై టెంకాయలు పగులగొట్టించుకొని
- మొక్కు తీర్చుకున్న భక్తులు
పెరంబూర్(చెన్నై): దిండుగల్ జిల్లా వలయపాడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మహాశివరాత్రి వేడుకల్లో భక్తులు తమ తలలపై టెంకాయలు పగులగొట్టించుకొని మొక్కు తీర్చుకున్నారు. ఇడయకోట వలయపట్టి రాయర్ వంశీయుల కురుంబ గౌండర్ వర్గం ప్రజల కులదేవత మహాలక్ష్మి ఆలయం(Mahalakshmi Temple)లో యేటా మహాశివరాత్రి ముగిసిన మరుసటిరోజు ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈమేరకు శనివారం అమ్మవారికి ప్రత్యేక అభిషేక, ఆరాధన, మహాదీపారాధన జరిగింది. ఆదివారం ఉదయం దీక్ష చేపట్టిన 52 భక్తుల తలలపై పూజారి పూచ్చప్పన్ టెంకాయలు పగులగొట్టి మొక్కులు తీర్చారు. సోమవారం పరివార పూజలు నిర్వహించి, పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.