Chennai: గాలి నుంచి నీరు తయారీ.. ‘బోట్ హౌస్’లో ఏర్పాటు
ABN , First Publish Date - 2023-05-26T12:19:11+05:30 IST
సెయ్యారు సమీపం ముదలియార్కుప్పం గ్రామంలో తమిళనాడు పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘రెయిన్ డ్రాప్ బోట్ హౌస్’ ఏర్పాటైంది

పెరంబూర్(చెన్నై): సెయ్యారు సమీపం ముదలియార్కుప్పం గ్రామంలో తమిళనాడు పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘రెయిన్ డ్రాప్ బోట్ హౌస్’ ఏర్పాటైంది. సెలవులు, వారాంతపు రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ చెన్నై ఐఐటీ(Chennai IIT) ఆధ్వర్యంలో గాలిలో తేమ నుంచి నీటిని తయారుచేసే యంత్రం ఏర్పాటుచేశారు. 2.3 మీటర్ల ఎత్తు, టన్ను బరువు కలిగిన ఈ యంత్రం విద్యుత్తో పనిచేయనుంది. రోజుకు 700 నుంచి 1,000 లీటర్ల నీరు తయారుచేసేలా ఏర్పాటైన ఈ యంత్రం త్వరలో అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.