Chennai: థాయ్‌ యువరాణికి అనకాపుత్తూరు పట్టుచీర బహుమతి

ABN , First Publish Date - 2023-06-01T11:42:04+05:30 IST

థాయ్‌లాండ్‌ యువరాణికి బహుమతిగా ఇచ్చేందుకు అనకాపుత్తూరు చేనేత కార్మికులు పట్టుచీరను కేవలం రెండు రోజుల్లో తయారు

Chennai: థాయ్‌ యువరాణికి అనకాపుత్తూరు పట్టుచీర బహుమతి

అడయార్‌(చెన్నై): థాయ్‌లాండ్‌ యువరాణికి బహుమతిగా ఇచ్చేందుకు అనకాపుత్తూరు చేనేత కార్మికులు పట్టుచీరను కేవలం రెండు రోజుల్లో తయారు చేశారు. థాయ్‌ వేదికగా అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌, సదస్సు ఈ నెల 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సులో థాయ్‌ యువరాణి పాల్గొనున్నారు. ఆమెకు బహుమతిగా ఇచ్చేందుకు అనకాపుత్తూరు నేత కార్మికులు పట్టు చీరను తయారు చేశారని ఇయర్‌కై నార్‌ నేత కార్మిక సంఘం అధ్యక్షుడు శేఖర్‌(Shekhar) వెల్లడించారు. 2015లో మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తాము నేసిన ధోవతిని ధరించారని గుర్తు చేశారు. ఇపుడు థాయ్‌లాండ్‌ యువరాణి కోసం పట్టు చీరను తయారు చేసి పంపించినట్టు తెలిపారు.

Updated Date - 2023-06-01T11:42:04+05:30 IST