Chennai: శివలింగాన్ని చుట్టిన కొండచిలువ

ABN , First Publish Date - 2023-07-05T10:49:59+05:30 IST

తిరుప్పూరు జిల్లా తారాపురం కోట్టైమేడు వీధిలో మూతపడిన ప్రాచీన ఆలయంలోని శివలింగానికి ఓ కొండచిలువ నెమ్మదిగా ప్రదక్షిణ చేయడంతో స్థా

Chennai: శివలింగాన్ని చుట్టిన కొండచిలువ

- పరవశించిన భక్తులు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరుప్పూరు జిల్లా తారాపురం కోట్టైమేడు వీధిలో మూతపడిన ప్రాచీన ఆలయంలోని శివలింగానికి ఓ కొండచిలువ నెమ్మదిగా ప్రదక్షిణ చేయడంతో స్థానిక భక్తులు గమనించి పారవశ్యం చెందారు. తారాపురంలో 500 యేళ్లనాటి విశ్వేశర ఆలయం శిథిలస్థితిలో ఉంది. ఆ ఆలయాన్ని కొన్నేళ్లకు ముందు మూసివేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆ ఆలయంలోకి కొండచిలువ ప్రవేశించడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వెళ్ళి చూసినప్పుడు ఆ కొండచిలువ శివలింగాన్ని నెమ్మదిగా వలాయకారంలో ప్రదక్షిణ చేయడం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు పారవశ్యం చెందారు. వెంటనే ఇళ్ల నుంచి పాలను తీసుకువచ్చి శివలింగం(Shiv Lingam)పై పోసి మొక్కారు. కాసేపయ్యాక జనాన్ని చూసి జడుసుకున్న ఆ కొండచిలువ ఓ చెట్టు తొర్రలో దూరింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తొర్రలో దూరిన కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి విడచిపెట్టారు.

Updated Date - 2023-07-05T10:49:59+05:30 IST