హనీమూన్కు వెళ్లిన కొత్త జంట.. అక్కడ భార్య చేసిన పనికి భర్తకు షాక్.. కళ్లు తెరిచి చూసే సరికి..
ABN , First Publish Date - 2023-01-10T14:47:15+05:30 IST
ఆ యువకుడికి కొద్ది రోజుల క్రితమే పెళ్లి జరిగింది.. భార్యతో కలిసి ఎంతో సంతోషంగా హనీమూన్ కోసం ముస్సోరి వెళ్లాడు.. అక్కడ భార్యతో కలిసి అన్ని ప్రదేశాలను చూశాడు.. రాత్రికి ఓ హోటల్కు చేరుకుని భార్యతో కలిసి భోజనం చేశాడు.. అనంతరం..
ఆ యువకుడికి కొద్ది రోజుల క్రితమే పెళ్లి జరిగింది.. భార్యతో కలిసి ఎంతో సంతోషంగా హనీమూన్ కోసం ముస్సోరి వెళ్లాడు.. అక్కడ భార్యతో కలిసి అన్ని ప్రదేశాలను చూశాడు.. రాత్రికి ఓ హోటల్కు చేరుకుని భార్యతో కలిసి భోజనం చేశాడు.. అనంతరం మత్తుగా నిద్రపోయాడు.. అర్ధరాత్రి లేచి చూసే సరికి అతని భార్య, ఆమె బట్టలు, బంగారం కనిపించలేదు.. హోటల్ సీసీటీవీ కెమేరా చూడగా ఆమె రాత్రికి రాత్రే హోటల్ నుంచి వెళ్లిపోయినట్టు తేలింది (Newly Married Couple).
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) అలీగఢ్కు చెందిన సత్యం టాండన్కు డిసెంబర్ 28వ తేదీన దీపాక్షి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వారిద్దరూ ఈ నెల 7వ తేదీన హనీమూన్ కోసం డెహ్రాడూన్ వెళ్లారు. ముస్సోరీని సందర్శించి, సాయంత్రం తిరిగి వచ్చి రిషికేశ్లో గది తీసుకున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత భర్తకు దీపాక్షి టీ ఇచ్చింది. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రి 2 గంటలకు సత్యంకు తెలివి వచ్చింది. నిద్ర లేచి చూసే సరికి భార్య కనిపించలేదు. హోటల్ రిసెప్షన్లో అడగగా, వారు సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆమె వెళ్లిపోయిందని చెప్పారు (Crime News).
రూ.10 లక్షలు విలువైన నగలు తీసుకెళ్లిపోవడంతో సత్యం వెంటనే ఉత్తరాఖండ్ పోలీసులకు, అలీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్తమామలకు ఫోన్ చేసి అడగ్గా.. వారు తిరిగి అల్లుడినే బెదిరించడం ప్రారంభించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితులు ఘోరంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో ఈ కుట్ర వెనుక అత్తమామలు కూడా ఉన్నారని సత్యం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.