Atlee: షారూఖ్ ఖాన్ తర్వాత వరుణ్ ధావనే!

ABN , First Publish Date - 2023-02-04T16:01:04+05:30 IST

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) తో అట్లీ సినిమా చేయనున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రాజెక్టు గురించి వరుణ్, అట్లీ కూడా చర్చలు జరిపారని సమాచారం. అట్లీ చెప్పిన ఐడియాకు వరుణ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.

Atlee: షారూఖ్ ఖాన్ తర్వాత వరుణ్ ధావనే!

దక్షిణాదిలోని టాప్ డైరెక్టర్స్‌లో అట్లీ (Atlee) ఒకరు. ‘రాజా రాణి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో ‘జవాన్’ (Jawan) చిత్రం చేస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పఠాన్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత షారూఖ్ ఖాన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ప్రాజెక్టుపై భారీ బజ్ ఉంది. ఈ పాన్ ఇండియా చిత్రం జూన్‌లో విడుదల కానుంది. ఈ మూవీ విడుదలకు ముందే అట్లీ నెక్ట్స్ ప్రాజెక్టు ఫిక్స్ అయినట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) తో అట్లీ సినిమా చేయనున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ప్రాజెక్టు గురించి వరుణ్, అట్లీ కూడా చర్చలు జరిపారని సమాచారం. అట్లీ చెప్పిన ఐడియాకు వరుణ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, కాంట్రక్ట్ మీద సంతకం చేయలేదని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. అట్లీ తెరకెక్కించిన ‘తెరీ’ (Theri) నే బాలీవుడ్‌లో వరుణ్‌తో రీమేక్ చేయనున్నట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు మురాద్ ఖేతనీ, అట్లీ నిర్మాతలు వ్యవహరించనున్నారు. ఈ ఏడాది జూన్ లేదా సెప్టెంబర్‌లో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘తెరీ’ లో ఇళయ దలపతి విజయ్ హీరోగా నటించారు. సమంత రుత్ ప్రభు, అమీ జాక్సన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది.

Updated Date - 2023-02-04T16:01:05+05:30 IST