Lovers Suicide: విషం తాగి ప్రేయసి చనిపోయిందని తెలిసి.. ఇంటి ముందున్న చెట్టుకు చీరతో ఉరి వేసుకుని మరీ ఆ ప్రియుడు కూడా..

ABN , First Publish Date - 2023-01-27T11:37:53+05:30 IST

జార్ఖండ్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది.

Lovers Suicide: విషం తాగి ప్రేయసి చనిపోయిందని తెలిసి.. ఇంటి ముందున్న చెట్టుకు చీరతో ఉరి వేసుకుని మరీ ఆ ప్రియుడు కూడా..

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లో (Jharkhand) హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్లు (Minors) బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. ఒకరినొకరు ప్రేమించుకున్న వారిని పెద్దలు విడదీయడంతో ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నారు. మొదట అమ్మాయి విషయం తాగి సూసైడ్ చేసుకోగా, ఈ విషయం తెలిసిన అబ్బాయి ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాబాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూనం(14), బిధాన్ పర్హియా(17) ఇద్దరిదీ ఒకే ఊరు. లవదాగ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. గత ఏడాదిన్నర నుంచి ప్రేమలో (Lovers) ఉన్నారు. ఈ విషయం ఇటీవల ఇరువురు పెద్దలకు తెలియడంతో వారిని వారించారు.

ఇకపై ఒకరినొకరు కలుసుకోవడం గానీ, మాట్లాడుకోవడం గానీ చేయ్యెుద్దంటూ తెగేసి చెప్పేశారు. దీంతో పూనం, బిధాన్ మనస్థాపానికి గురయ్యారు. పెద్దలు తమను విడదీయడం ఖాయం అని భావించిన వారు కలిసి ఎలాగు జీవించలేం కనుకు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. మొదట పూనం విషం తాగి చనిపోయింది. ఈ విషయం బిధాన్‌కు తెలిసింది. దాంతో ఇంట్లోంచి తన తల్లి చీర తీసుకెళ్లి ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఇలా గంటల వ్యవధిలోనే ఒకేరోజు ప్రేమికులిద్దరు ప్రాణాలు (Lovers Suicide) తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి వచ్చిన జాబాంగ్ పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులను పిలిచి విచారించడంతో ఈ విషయం బయటకు తెలిసింది. ఈ ఘటనతో లవదాగ్ గ్రామంలో విషాదం అలుముకుంది. ఇరువురు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Updated Date - 2023-01-27T11:37:54+05:30 IST