NRI: సింగపూర్‌లో ఘనంగా తెలుగువారి పండుగ

ABN , First Publish Date - 2023-01-31T17:42:01+05:30 IST

సింగపూర్‌లో కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు.

NRI:  సింగపూర్‌లో ఘనంగా తెలుగువారి పండుగ

భావితరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, పండుగల ప్రాశస్త్యముల గురించి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో సొంత నేలకు దూరంగా సింగపూర్‌లో నివసిస్తున్న కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులందరూ కలిసి సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్‌లో (SUTD) ఈ రోజు (29-01-2023) ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 వరకూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 550కి పైగా కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు హాజరైన ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ విశిష్టతతో పాటు ఆ 4 రోజులూ జరుపుకునే పండుగ సాంప్రదాయాల వెనుక దాగిఉన్న విషయాలను అతి చక్కగా పిల్లలకు వివరించారు. సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ సంస్థ స్థాపించి 3 సంవత్సరాలు అయిందని, కోవిడ్ తదనంతరం తమ సంస్థ ఇంత మంది తెలుగు వారితో కలిపి జరుపుకుంటున్న 2వ అతి పెద్ద పండుగ ఇదేనని చెప్పారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రావడం ద్వారా మరింత మంది సాటి తెలుగు వారు సన్నిహుతులు అయ్యారని అలాగే విభిన్నమైన ఆటలద్వారా ఒకరితో ఒకరికి పరిచయాలు పెంచుకునేలా రూపొందించిన కార్యక్రమ రూపకల్పన చక్కగా ఉందని పలువురు ప్రశంసించారు.

4.jpg2.jpg3.jpg7.jpg6.jpg1.jpg

Updated Date - 2023-01-31T17:42:02+05:30 IST