NRI: పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్నారైల సేవా కార్యక్రమాలు

ABN , First Publish Date - 2023-02-06T21:23:18+05:30 IST

ఎన్నారై యూకే, యూరోప్ విభాగానికి చెందిన తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల వివేక్ కరియవుల.. పూతలపట్టు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

NRI: పూతలపట్టు నియోజకవర్గంలో ఎన్నారైల సేవా కార్యక్రమాలు

ఎన్నారై యూకే, యూరోప్ విభాగానికి చెందిన తెలుగుదేశం ముఖ్య నాయకులు శ్యామ సుందర్ ఊట్ల (పూతపట్టు నియోజకవర్గం పోటుకనుమ గ్రామస్థులు), వివేక్ కరియవుల.. పూతలపట్టు నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. గతంలో కార్యకర్తల మీద దాడులు జరిగితే అండగా ఉండి న్యాయ సహాయం చేశారు. పార్టీ ప్రారంభించిన ప్రతి కార్యక్రమాన్నీ ఇక్కడ చేస్తున్నారు. కొన్ని మండల కేంద్రాల్లో ఫిబ్రవరి 3, 4, 5 తేదీలలలో వలంటీర్ల కోసం ఆహార పంపిణీ ఏర్పాటు చేశారు. నగరిలోకి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చెయ్యటానికి తమ వంతు సహాయం అందిస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు తిత్లీ తుఫాన్‌ సమయంలో, యుక్రెయిన్‌లో బాధితుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాలకి వచ్చిన విద్యార్థులకు తోచినంత సాయం సహాయం చెయ్యటం, అలానే మంచి ఉద్యోగాలు ఇప్పించటంలో బాగా కృషి చేశారు.

3.jpg

తెలుగుదేశం కార్యకర్తలకి సోషల్ మీడియా ట్రైనింగ్ ఇచ్చేలా ఒక్కో నియోజకవర్గానికీ ఒక్కో వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం వస్తేనే యువతకి భవిత... లేకపోతే మరో 30 ఏళ్ళు వెనక్కి పోతారు అనే నినాదంతో పార్టీ అభివృద్ధిలో భాగం చేస్తున్నారు. యువ నాయకుడు లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యి... తెలుగుదేశం పార్టీని విజయతీరాలకు చేర్చాలని కోరుకుంటూ యాత్ర కొనసాగే 400 రోజుల్లో కొన్ని నియోజక వర్గాలలో పలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. డా. కిషోర్ బాబు చలసాని, కృష్ణ వల్లూరి, శ్రీనివాస్ గోగినేని, కృష్ణ ప్రసాద్ katragadda, అమర్నాథ్ పొట్లూరి, వేంకటపతి, ప్రవీణ్ ఉన్నం, ప్రవీణ్ వెలువోలు, కొండయ్య కావూరి, శివ కృష్ణ, సుమంత్ పద్మాల, వివిధ NRI సభ్యులందరూ ఈ కార్యక్రమాలకు తమ వంతు సహాయం అందిస్తున్నారు.

2.jpg

Updated Date - 2023-02-06T21:45:24+05:30 IST