Anti Cold Drug: నాలుగేళ్ల లోపు పిల్లలకు వాడే యాంటీ-కోల్డ్ సిరప్ వినియోగంపై కేంద్రం నిషేధం..!!
ABN , Publish Date - Dec 21 , 2023 | 11:52 AM
141 మంది పిల్లలు ఈ సిరప్ తీసుకోవడంతో మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
పిల్లాడు మరీ దగ్గుతున్నాడని, దగ్గు, జలుబు చేసిందని సిరప్స్ వేస్తూ ఉంటాం. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో మరణాలు పెరగడంపై ఆ సిరప్ను పిల్లలకు పట్టవద్దని నిషేదించింది. అసలు దగ్గు సిరప్కి సంబంధించి జరుగుతున్న మరణాలపై ప్రపంచవ్యాప్త ఆందోళనల మధ్య భారతదేశం డ్రగ్స్ రెగ్యులేటర్ నాలుగేళ్ళ లోపు పిల్లలకు యాంటీ కోల్డ్ డ్రగ్ను నిషేధించింది.
గత ఏడాది మధ్యలో గాంబియా, ఉజ్బేకిస్తాన్, కామెరూన్ లలో కనీసం 141 మంది చిన్నారుల మరణాలు సంభవించాయి. దేశంలో తయారు చేయబడిన విషపూరిత దగ్గు సిరప్లతో అధికారులు 2019 నుంచి అనేక మంది పిల్లల మరణాల గురించి అధ్యయనాలు మొదలు పెట్టింది. భారతదేశంలో కనీసం 12మంది పిల్లలు మరణించారని, మరో నలుగురు తీవ్ర వైకల్యాంతో మిగిలిపోయారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈ టిప్స్ ఫాలో అయితే పిల్లల్లో కనిపించే ఫ్లూకి చెక్ పెట్టినట్టే..!!
భారత దేశం జూన్ నుండి ఈ దగ్గు సిరప్ ఎగుమతుల కోసం తప్పని సరి పరీక్షలను ప్రవేశపెట్టింది. ఔషధ తయారీదారుల పరిశీలనను వేగవంతం చేసింది. పిల్లల మరణాలకు దగ్గు, సిరప్ లతో సంబంధం ఉన్న ఔషధ తయారీదారులు ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.