State Govt: వారి వేతనం పెంచే అవకాశమే లేదు..

ABN , First Publish Date - 2023-06-07T08:37:42+05:30 IST

ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రభుత్వ నర్సులతో సమానంగా వేతనం పంపిణీ చేయలేమని మద్రాసు హైకోర్టులో రాష్ట్రప్రభు

State Govt: వారి వేతనం పెంచే అవకాశమే లేదు..

ప్యారీస్‌(చెన్నై): ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రభుత్వ నర్సులతో సమానంగా వేతనం పంపిణీ చేయలేమని మద్రాసు హైకోర్టులో రాష్ట్రప్రభుత్వం(State Govt) దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది. వేతనం పంపిణీ తదితర పలు డిమాండ్లతో 2017వ సంవత్సరం నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమానికి స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు(Madras High Court)లో రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాదులు అఫిడవిట్‌ దాఖలు చేశారు. కేంద్రప్రభుత్వ జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా నియమితులైన కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రస్తుతం రూ.18 వేల వేతనం అందిస్తున్నారని, రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ నర్సులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనం పంపిణీ చేస్తున్నామని, అందువల్ల పర్మినెంట్‌ నర్సులకు సమానంగా వీరికి వేతనం పంపిణీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2023-06-07T08:37:42+05:30 IST