SP, DSP: ఎస్పీ, డీఎస్పీ మధ్య ముదిరిన ‘గొడవ’

ABN , First Publish Date - 2023-06-22T12:27:06+05:30 IST

ఎస్పీ రంజిత్‌(SP Ranjith), తోరణగల్లు డీఎస్పీ ఖాసీగౌడ మధ్య సెలవుల గొడవ బజారున పడింది. ఎస్పీ రంజిత్‌కుమార్‌ సెలవులు ఇవ్వడం లేద

 SP, DSP: ఎస్పీ, డీఎస్పీ మధ్య ముదిరిన ‘గొడవ’

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): బళ్లారి జిల్లా ఎస్పీ రంజిత్‌(SP Ranjith), తోరణగల్లు డీఎస్పీ ఖాసీగౌడ మధ్య సెలవుల గొడవ బజారున పడింది. ఎస్పీ రంజిత్‌కుమార్‌ సెలవులు ఇవ్వడం లేదని డీజీపీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డీఎస్పీ ఖాసీగౌడ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ రంజిత్‌ కుమార్‌ తనకు సెలవులు ఇవ్వడం లేదని, తాను మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యంబారిన పడ్డానని, తనకు సెలవులు ఉన్నా ఎందుకో ఇవ్వడం లేదని అందులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్పీ రంజిత్‌ కుమార్‌ వివరణ కోరగా.. తోరణగల్లు స్టేషన్‌లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఖాసీగౌడ పదేపదే సెలవులపై వెళతున్నారని తెలిపారు. ఆయనకు ఉన్న సెలవులన్నీ పూర్తయ్యాయని, అదనంగా కూడా సెలవులు వాడారని వివరించారు. ఎన్నికల సమయంలోనూ ఆరోగ్యం సరిగా లేదని మెడికల్‌ లీవ్‌పై వెళ్లారని తెలిపారు. ఒక డీఎస్పీ పదేపదే సెలవులపై వెళితే ఆయన పరిధిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్నారు. అందుకే సెలవు ఇవ్వడం కుదరదన్నానని, అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆధారాలతో ఐజీకి పంపినట్లు తెలిపారు. ఏదీ ఏమైనా ఎస్పీ, డీఎస్పీ సెలవుల వివాదం సామాజిక మాద్యమాల్లోనూ హల్‌చల్‌ చేస్తోంది.

Updated Date - 2023-06-22T12:27:06+05:30 IST