Narendra Modi : మోదీ రోడ్షోలో భద్రతా వైఫల్యం
ABN , First Publish Date - 2023-01-12T17:35:41+05:30 IST
కర్ణాటకలోని హుబ్బళిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్షోలో భద్రతా వైఫల్యం కనిపించింది.
హుబ్బళి : కర్ణాటకలోని హుబ్బళిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్షోలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ యువకుడు అనుమతి లేకుండా ఆయనకు పూలమాల ఇచ్చేందుకు ఆయన వద్దకు చేరుకోగలిగాడు. ఆ పూలమాలను మోదీ స్వీకరించారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు ఆయన గురువారం ఇక్కడికి వచ్చారు. హుబ్బళి-ధార్వాడ్ రైల్వే క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.