Raksha Bandhan : స్పీచ్ మధ్యలోనే ఆపేసి రాఖీ కట్టించుకున్న సీఎం

ABN , First Publish Date - 2023-08-30T20:49:17+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఒక మహిళ రాఖీ పట్టుకుని ఆయన ఉన్న వేదకపైకి వచ్చింది. వెంటనే ఆయన తన ప్రసంగాన్ని ఆపేసి రాఖీ కట్టించుకుని, ఆ తర్వాత నిండుమనసులో ఆ సోదరిని ఆశీర్వదించారు.

Raksha Bandhan : స్పీచ్ మధ్యలోనే ఆపేసి రాఖీ కట్టించుకున్న సీఎం

ఛండీగఢ్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన 'రక్షా బంధన్' (Raksha Bandhan) వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత కోలాహలంగా, సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకూ ఎంతో ఉత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొంటారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Mann) ఎంతో సాదరంగా ఒక మహిళ చేత రాఖీ (Rakhi) కట్టించుకున్న ఆసక్తికర ఘట్టం బుధవారంనాడు చోటుచేసుకుంది. సీఎం ప్రసంగిస్తుండగా ఒక మహిళ రాఖీ పట్టుకుని ఆయన ఉన్న వేదకపైకి వచ్చింది. వెంటనే ఆయన తన ప్రసంగాన్ని ఆపేసి రాఖీ కట్టించుకుని, ఆ తర్వాత నిండుమనసులో ఆ సోదరిని ఆశీర్వదించారు. గురునానక్ దేవ్ యూనివర్శిటీలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు నియామక పత్రాలు అందిచే కార్యక్రంలో సీఎం పాల్గొన్నప్పుడు ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

Updated Date - 2023-08-30T20:50:00+05:30 IST