Ponguleti Sudhakar Reddy: బూత్‌ కమిటీల ఏర్పాటులో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2023-02-24T07:49:26+05:30 IST

బూత్‌ కమిటీల ఏర్పాటులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మండల బీజేపీ నేతలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల కో-ఇన్‌చార్జి డాక్టర్‌ పొంగులేటి

Ponguleti Sudhakar Reddy: బూత్‌ కమిటీల ఏర్పాటులో అలసత్వం వద్దు

- బీజేపీ శ్రేణులకు పొంగులేటి హెచ్చరిక

పెరంబూర్‌(చెన్నై): బూత్‌ కమిటీల ఏర్పాటులో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మండల బీజేపీ నేతలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల కో-ఇన్‌చార్జి డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి(Ponguleti Sudhakar Reddy) హెచ్చరించారు. ఆయన మండల పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం పార్టీకి అతి కీలకమైన సమయమని, రాష్ట్ర బీజేపీ వ్యవహారాలను జేపీ నడ్డా(JP Nadda) స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే సమయం ఆసన్నమైందని, నిర్ణీత సమయంలో బూత్‌ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు. ప్రతి బూత్‌లో ఐదు ప్రాంతాల్లో ‘తామర’ చిహ్నం ఏర్పాటుచేయాలన్నారు. అధికార డీఎంకే శ్రేణుల అరాచకాలపై ఆందోళన చేపట్టాలన్నారు ప్రధాని మోదీ తమిళనాడుకు ప్రాధాన్యం అందిస్తున్నారని సుధాకర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-24T07:49:27+05:30 IST