Ladakh Accident: లడఖ్‌లో విషాదం.. ఆర్మీ వ్యాను లోయలో పడి తొమ్మిది మంది సైనికుల మృతి

ABN , First Publish Date - 2023-08-19T21:36:59+05:30 IST

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో శనివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడటంతో భారత ఆర్మీకి చెందిన తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Ladakh Accident: లడఖ్‌లో విషాదం.. ఆర్మీ వ్యాను లోయలో పడి తొమ్మిది మంది సైనికుల మృతి

లడఖ్: కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో (Ladakh) శనివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడటంతో భారత ఆర్మీకి (Indian Army) చెందిన తొమ్మిది మంది సైనికులు (Soldiers) మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్యారీ టౌన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులతో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ అధికారులు (జేసీఓ) ఉన్నట్టు అధికారులు తెలిపారు. లెహ్ సమీపంలోని కరు గారిసన్ నుంచి క్యారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు లడఖ్‌లోని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు సైనికులు గాయపడినట్టు చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Updated Date - 2023-08-19T21:36:59+05:30 IST