PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ
ABN , First Publish Date - 2023-05-27T08:43:53+05:30 IST
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం ఢిల్లీలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది.

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం (Neeti Aayog Governing Council Meeting) శనివారం ఢిల్లీలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. 'వికాసిత్ భారత్' పేరుతో 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించడం కోసం 'రోడ్ మాప్' రూపొందించారు. కాగా ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు హాజరుకావడంలేదు.
ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) హాజరవుతున్నారు. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంతో పాటు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్తో పాటు యూపిఏ (UPA) భాగస్వామ్య పార్టీల సీఎంలు కూడా బహిష్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు కార్యక్రమాలకు భారత రాష్ట్ర సమితి (BRS), తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) హాజరుకావడంలేదు. తొలుత నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై ప్రతిపక్ష నేతలను కలవాలని బెంగాల్ సీఎం మమత బెనర్జీ భావించారు. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు.