Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మద్యం సేవించే వారిసంఖ్య అంటూ..

ABN , First Publish Date - 2023-03-24T12:52:13+05:30 IST

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం సేవించే వారి సంఖ్య రాష్ట్రంలో తక్కువగా ఉందని మంత్రి పీటీఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌(Minister PTR Palanive

Minister: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మద్యం సేవించే వారిసంఖ్య అంటూ..

పెరంబూర్‌(చెన్నై): ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం సేవించే వారి సంఖ్య రాష్ట్రంలో తక్కువగా ఉందని మంత్రి పీటీఆర్‌ పళనివేల్‌ త్యాగరాజన్‌(Minister PTR Palanivel Thyagarajan) శాసనసభ సమావేశాల్లో వెల్లడించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆర్ధిక, వ్యవసాయ బడ్జెట్‌లపై చర్చ జరుగుతున్న సమయంలో అరక్కోణం అన్నాడీఎంకే ఎమ్మెల్యే రవి(MLA Ravi) మాట్లాడుతూ, మద్యం ద్వారా గత ఏడాది రూ.32 కోట్లు, ఈ ఏడాదిరూ.45కోట్ల మేరకు రాష్ట్రప్రభుత్వం ఆదాయంపొందిందని,ఈఏడాది మద్యం సేవించే వారి సంఖ్య 25 శాతం పెరిగిందని, ఇదేనా డీఎంకే ప్రభుత్వ సాధనా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ స్పందిస్తూ, కరోనా వ్యాప్తి నుంచి మద్యం సేవించే వారి సంఖ్య తగ్గిందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం సేవించే వారి సంఖ్య తక్కువని మంత్రి బదులిచ్చారు.

Updated Date - 2023-03-24T12:52:13+05:30 IST