Minister: బీజేపీ రాష్ట్ర నేతకు పరువునష్టం దావా నోటీసు

ABN , First Publish Date - 2023-04-20T10:27:34+05:30 IST

బీజేపీ రాష్ట్ర నేతకు పరువునష్టం దావాకు సంభంధించిన నోటీసులు పంపారు. తనపై అసత్య ఆరోపణలు చేయడమేగాక

Minister: బీజేపీ రాష్ట్ర నేతకు పరువునష్టం దావా నోటీసు

చెన్నై: తనపై నిరాధారమైన, పరువుకు నష్టం కలిగేలా ఆరోపణలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కు రాష్ట్ర మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) నోటీసులు పంపించారు. అన్నామలై ఇటీవల వెలువరించిన ఆస్తుల జాబితాలో సీఎం స్టాలిన్‌, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు పేర్కొంటూ, సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధికి రూ.2,039 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఉదయనిధి తరఫున సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ ద్వారా అన్నామలైకు పంపిన నోటీసులో, 48 గంటల్లో అన్నామలై క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో రూ.50 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతూ కేసు దాఖలు చేస్తామని మంత్రి ఉదయనిధి హెచ్చరించారు.

Updated Date - 2023-04-20T10:27:34+05:30 IST