Lands: ఆ భూమి విలువ ఎంతో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-02-18T12:48:54+05:30 IST
బెంగళూరు గ్రామీణ(Bangalore rural) జిల్లా హొస్కోటె తాలూకా జడిగేనహళ్ళి హోబళి కాచరకనహళ్ళికి చెందిన 4 ఎ
హొస్కోటె(బెంగళూరు), ఫిబ్రవరి 17: బెంగళూరు గ్రామీణ(Bangalore rural) జిల్లా హొస్కోటె తాలూకా జడిగేనహళ్ళి హోబళి కాచరకనహళ్ళికి చెందిన 4 ఎకరాల ఖరాబు భూమిని తాలూకా యంత్రాంగం శుక్రవారం స్వాధీనం చేసుకుంది. హొస్కోటె- మాలూరు(Hoskote- Malur) రాష్ట్ర రహదారికి అనుబంధంగా 4 ఎకరాలకంటే అధికంగా ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని చుట్టుపక్కల ఉన్న వారు క్రమేపీ ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక ఎకరా సుమారు రూ.5కోట్ల వరకు ఉంటోంది. ఈ లెక్కన రూ.25 కోట్ల విలువైన భూమిని ఆక్రమణ కోరలనుంచి విముక్తి కల్పించినట్టయ్యింది. తగిన ఆధారాలతో తాలూకా రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని సదరు స్థలంలో నామఫలకం ఏర్పాటు చేశారు. ఆక్రమణలు తొలగించడంలో తహసీల్దారు మహేశ్కుమార్ నేతృత్వంలోని బృందం విజయవంతంగా పూర్తి చేసింది.