Kavery waters: కావేరిని విడుదల చేయిస్తారా? లేదా?
ABN , First Publish Date - 2023-09-20T08:19:31+05:30 IST
రాష్ట్రానికి రావాల్సిన కావేరి జలాలను కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) విడుదల చేసేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ డెల్టా

- డెల్టా రైతుల నిరసన
- పలుచోట్ల రైల్ రోకో
పెరంబూర్(చెన్నై): రాష్ట్రానికి రావాల్సిన కావేరి జలాలను కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) విడుదల చేసేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ డెల్టా రైతులు నిరసనకు దిగారు. మంగళవారం తంజావూరు, తిరువారూర్, సీర్గాళి, నాగపట్టణం ప్రాంతాల్లో తమిళనాడు కావేరి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో రైల్ రోకోలు చేపట్టారు. దీంతో పలు చోట్ల రైళ్లు నిలిచిపోయాయి. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టడంతో రైళ్లు ఆలస్యంగా బయలుదేరాయి. రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల కురువై పంటలు, సాంబా సీజన్లో 15 లక్షల ఎకరాల్లో సాగుచేసేలా కావేరి నిర్వహణ మండలి ఉత్తర్వుల ప్రకారం కర్ణాటక నీటిని విడుదల చేయాలని, మెకెదాటు డ్యాం(Mekedatu Dam) నిర్మాణాన్ని కర్ణాటక ప్రభుత్వం విరమించుకోవాలని, కావేరి నిర్వహణ మండలి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరాదనే డిమాండ్లతో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఆర్ పాండ్యన్ పిలుపునిచ్చారు. తంజావూరులో ఆ సంఘ అధ్యక్షుడు పళనియప్పన్ అధ్యక్షతన జరిగిన జరిగిన రైల్ రోకోలో రైతులు భారీ సంఖ్యలో పాల్గొని కర్ణాటక, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.