Governor: గవర్నర్ తమిళిసై అంతమాట అనేశారేంటి.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-25T12:49:42+05:30 IST

తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై(Governor Dr. Tamilisai) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Governor: గవర్నర్ తమిళిసై అంతమాట అనేశారేంటి.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

అడయార్‌(చెన్నై): కార్మికుల పని సమయాన్ని 12గంటలకు పెంచు తూ డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనూహ్య మద్దతు లభించింది. డీఎంకే మిత్రపక్షాలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పు బడుతుండగా, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై(Governor Dr. Tamilisai) మాత్రం స్టాలిన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం. సోమవారం మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తమిళిసై మీడియతో మాట్లాడుతూ.. రోజుకు 12 గంటలా?, లేక 8 గంటలు పనిచేయాలా అనే విషయాన్ని కార్మికుడు నిర్ణయించుకోవాలన్నారు. ఈ చట్టంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల వద్ద అధ్యయనం చేశారన్నారు. ఇందులో అధిక సమయం పని చేసి, అధిక సమయం విశ్రాంతినివ్వడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తేలిందన్నారు. ఇక్కడ పని గంటలు మాత్రమే పెంచారని, కార్మికుడిపై అధిక భారాన్ని మోపలేదన్నారు. ఈ చట్టాన్ని ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ(Governor Dr. Tamilisai) రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. ఈ చట్టాన్ని రాజకీయం చేయరాదని సూచించారు. తాను ఒక గవర్నర్‌గా ఉన్నందున, రాజకీయాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే - బీజేపీ కూటమి గురించి తనకేమీ తెలియదన్నారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఇతర రాజకీయ పార్టీల నేతల వద్ద తనకు మంచిపేరు, గౌరవం ఉండేదని తమిళిసై గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2023-04-25T12:56:16+05:30 IST