Share News

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ABN , First Publish Date - 2023-12-13T09:15:46+05:30 IST

అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ABN Internet Desk: అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సౌకర్యార్ధం శబరిమలకు 51 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో మొత్తం 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ రైళ్ల రాకపోకల వివరాలను రైల్వే శాఖ ‘ఎక్స్’లో షేర్ చేసింది.

ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అత్యధికంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు వెళతారు. మరికొంతమంది మాల వేసుకోకుండానే (సివిల్) అయ్యప్పను దర్శించుకునేందుకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను అధికారులు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శబరిమలకు వెళ్లి వచ్చే భక్తుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలు..

శబరిమల వెళ్లి వచ్చే యాత్రికుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్ల వివరాలు.. డిసెంబర్‌ 27, జనవరి 3,10,17 తేదీల్లో సికింద్రాబాద్‌- కొల్లాం ప్రత్యేక రైలు (07111), డిసెంబర్‌ 29, జనవరి 5,12,19 తేదీల్లో కొల్లాం- సికింద్రాబాద్‌ (07112), డిసెంబర్‌ 28, జనవరి 4,11,18 తేదీల్లో కాకినాడ టౌన్‌- కొట్టాయం (07113), డిసెంబర్‌ 30, జనవరి 6,13,20 తేదీల్లో కొట్టాయం-కాకినాడ టౌన్‌ (07114), జనవరి 2న సికింద్రాబాద్‌-కొట్టాయం (07117), జనవరి 4న కొట్టాయం-సికింద్రాబాద్‌ (07118), జనవరి 6, 13 తేదీల్లో సికింద్రాబాద్‌ -కొట్టాయం (07009), జనవరి 8,15 తేదీల్లో కొట్టాయం-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07010)ను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-13T09:15:48+05:30 IST