Gayatri Raghuram: సినీనటి సెటైర్లు.. ప్రజలు ఛీకొట్టే విధంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు..
ABN , First Publish Date - 2023-06-01T10:16:40+05:30 IST
ఐపీఎల్ టోర్నీ ఫైనల్స్లో చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు విజయం చేకూర్చిపెట్టిన క్రికెటర్ జడేజా సతీమణి తమ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ వ్యాఖ్యానించిన
ప్యారీస్(చెన్నై) : ఐపీఎల్ టోర్నీ ఫైనల్స్లో చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు విజయం చేకూర్చిపెట్టిన క్రికెటర్ జడేజా సతీమణి తమ పార్టీ ఎమ్మెల్యేనే అంటూ వ్యాఖ్యానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై నటి గాయత్రి రఘురాం(Gayatri Raghuram) సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేశారు. క్రికెటర్ జడేజాను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారా ఏంటి అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఛీకొట్టే విధంగా అన్నామలై(Annamalai) రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వైఖరి వల్ల పార్టీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. అన్నామలై వ్యవహారశైలితో మనస్తాపం చెందిన గాయత్రి రఘురాం గత ఏడాది బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.