Gali Janardhan Reddy: ప్రతి దర్గాకు మూడు ప్యాకెట్ల బియ్యం

ABN , First Publish Date - 2023-08-01T12:57:18+05:30 IST

గంగావతిలోని ఒక్కో దర్గాకు మూడు ప్యాకెట్ల బియ్యం, 15 లీటర్ల నూనెను ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) వితరణ చేశారు. ప్రతి ద

Gali Janardhan Reddy: ప్రతి దర్గాకు మూడు ప్యాకెట్ల బియ్యం

గంగావతి(బెంగళూరు): గంగావతిలోని ఒక్కో దర్గాకు మూడు ప్యాకెట్ల బియ్యం, 15 లీటర్ల నూనెను ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డి(Gali Janardhan Reddy) వితరణ చేశారు. ప్రతి దర్గాకు వెళ్లి బియ్యం, నూనె పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదటిసారి చేపట్టామని, పీర్లను ప్రతిష్టించిన అనంతరం మూడు రోజుల పాటు కార్యక్రమం వుంటుందని, కావున ప్రజలకు, భక్తులకు అన్నదానం కోసం బియ్యం పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. బసవన సర్కిల్‌ దర్గా వద్ద జనార్దన్‌ రెడ్డి పీఏ అనికల్‌ మాట్లాడుతూ గంగావతి(Gangavati)లో మొదటిసారిగా జనార్దన్‌ రెడ్డి ఎమ్మెల్యే అయినందున దర్గాలో పీర్లను కూర్చుబెట్టిన వారికి బియ్యం ప్యాకెట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్‌ అలీ మహబూబ్‌, రసూల్‌ ముజవర్‌ బాషా, ఖాజుద్దీన్‌ మణియార్‌, సయ్యద్‌ మీరా, మహమ్మద్‌ దావూస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-08-01T12:57:18+05:30 IST