Indore: వంతెనపై నుంచి బస్సు పడి 14 మంది మృతి

ABN , First Publish Date - 2023-05-09T10:47:58+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది మరణించారు....

Indore: వంతెనపై నుంచి బస్సు పడి 14 మంది మృతి
bus falls off bridge

ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది మరణించారు. ఖార్గోన్ పట్టణంలో ఇండోర్ వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తూ వంతెనపై నుంచి కిందపడిపోవడంతో 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

ఆ ప్రాంతంలోని స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారుమధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.

Updated Date - 2023-05-09T10:59:01+05:30 IST