Jewellery showroom theft: నగల దుకాణం నుంచి రూ.25 కోట్లు చోరీ..

ABN , First Publish Date - 2023-09-26T15:25:44+05:30 IST

దేశ రాజధానిలోని భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యుయిలరీ షోరూమ్‌ను దొంగలు దోచుకున్నారు. రూ.25 కోట్లతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

Jewellery showroom theft: నగల దుకాణం నుంచి రూ.25 కోట్లు చోరీ..

న్యూఢిల్లీ: దేశ రాజధాని (New Delhi) లోని భోపాల్ ఏరియాలో భారీ దొంగతనం జరిగింది. ఉమ్రావ్ జ్యుయిలరీ షోరూమ్ (Umrao Singh Jewellery showroom)ను దొంగలు దోచుకున్నారు. రూ.25 కోట్లతో పరారయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు పోలీసులు తెలిపారు. గోడకు కన్నం వేసి నగల దుకాణంలోకి దొంగలు అడుగుపెట్టారు. ఇది చాలా పెద్ద దొంగతమనమని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నామని సౌత్-ఈస్ట్ డీజీపీ రాజేవ్ దేవ్ తెలిపారు.


మొత్తం దోచేశారు...

ఆదివారంనాడు దుకాణం మూసి ఈరోజు దుకాణం తెరిచామని, వెంటనే షాపు దోచుకున్నారనే విషయం గ్రహించామని నగల దుకాణం యజమాని సంజీవ్ జైన్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ గోడకు రంధ్రం కనిపించిందని, దుకాణం అంతా దుమ్ముతో నిండిపోయిందని చెప్పారు. షాపు మొత్తం దోచుకున్నారన్నారు. నగల విలువ 20 నుంచి 25 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. అగంతకులు టెర్రాస్ నుంచి లోపలకు అడుగుపెట్టారని, సీసీటీవీతో సహా అన్నింటినీ ధ్వంసం చేశారని జైన్ తెలిపారు.

Updated Date - 2023-09-26T15:25:44+05:30 IST