రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ

ABN , First Publish Date - 2023-04-28T13:52:09+05:30 IST

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు న్యాయమూర్తి నాగ్ పాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు తెలిపారు.

రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ

ఢిల్లీ : రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ జరిగింది. మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు న్యాయమూర్తి నాగ్ పాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు తెలిపారు. మూడో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమన్ సింగ్ ధాల్‌పై అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేశామని ఈడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమన్ సింగ్ ధాల్ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఆస్తులను కూడా జప్తు చేసినట్లు ఈడీ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రత్యేక కోర్టులో గురువారం ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మద్యం విధానంలో అక్రమాలు, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి అభియోగాలు మోపింది.

Updated Date - 2023-04-28T13:52:09+05:30 IST