Himanta Sarma: వరల్డ్ కప్ నెగ్గినట్టు ఫీలవుతున్నారు..!

ABN , First Publish Date - 2023-05-14T21:25:22+05:30 IST

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, అందుకు ఆ పార్టీ స్పందిస్తున్న తీరుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆదివారంనాడు నిశిత విమర్శ చేశారు. తామేదో ప్రపంచ కప్ గెలిచామన్నంతగా కాంగ్రెస్ పార్టీ ఓవర్ రియాక్షన్ చేస్తోందని అన్నారు.

Himanta Sarma: వరల్డ్ కప్ నెగ్గినట్టు ఫీలవుతున్నారు..!

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం (Victory) సాధించడం, అందుకు ఆ పార్టీ స్పందిస్తున్న తీరుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma) ఆదివారంనాడు నిశిత విమర్శ చేశారు. తామేదో ప్రపంచ కప్ గెలిచామన్నంతగా కాంగ్రెస్ పార్టీ ఓవర్ రియాక్షన్ చేస్తోందని అన్నారు.

''వాళ్లు (Congress) ఒక రాష్ట్రంలో గెలిచారు. దేశాన్నే గెలిచామనుకుంటున్నారు. మేము చాలా రాష్ట్రాల్లో గెలిచాం. కానీ ఎప్పుడూ అతిగా స్పందించలేదు'' అని శర్మ అన్నారు. సచిన్ టెండూల్యర్ ఒకసారి డబుల్ సెంచరీ చేస్తారనీ, మరోసారి డకౌట్ అవుతారనీ, అదే తరహాలో కాంగ్రెస్ కేవలం ఒక రాష్ట్రంలో గెలిచి ప్రపంచ కప్ గెలిచినంతగా సంబరపడిపోతోందని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో మేమే వస్తాం...

తెలంగాణ ఎన్నికలపై మాట్లాడుతూ, కాంగ్రెస్, టీఆర్ఎస్, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబితే అది వారి హక్కు అని, కానీ తెలంగాణలో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే నమ్మకం తమకు ఉందని శర్మ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-05-14T21:25:22+05:30 IST