Cell phone ban: ఆ ఆలయంలో నేటినుంచి సెల్‌ఫోన్‌ నిషేధం

ABN , First Publish Date - 2023-10-01T09:29:07+05:30 IST

దిండుగల్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పళని దండపాణి ఆలయంలో భక్తులు సెల్‌ఫోన్‌(Cell phone) వినియోగంపై నిషేధం విధించారు.

 Cell phone ban: ఆ ఆలయంలో నేటినుంచి సెల్‌ఫోన్‌ నిషేధం

ప్యారీస్‌(చెన్నై): దిండుగల్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పళని దండపాణి ఆలయంలో భక్తులు సెల్‌ఫోన్‌(Cell phone) వినియోగంపై నిషేధం విధించారు. మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆదివారంనుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. భక్తులు సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి అడుగు పెట్టరాదంటూ ఇప్పటికే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మెట్ల దారి, రోప్‌కార్‌, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో భక్తులు తమవెంట తీసుకెళ్లే సెల్‌ఫోన్లు భద్రపరచుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ.5ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వినాయకుడి ఆలయ ప్రాంగణంలో మూడుచోట్ల సెల్‌ఫోన్‌ ర్యాక్‌లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-10-01T09:29:07+05:30 IST