Tamilnadu: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన కారు..
ABN , First Publish Date - 2023-09-28T17:05:28+05:30 IST
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు స్పాట్ డెడ్ అయ్యాడు. తమిళనాడు(Tamilnadu)లో ఈ ఘటన జరిగింది.
తమిళనాడు: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాధితుడు స్పాట్ డెడ్ అయ్యాడు. తమిళనాడు(Tamilnadu)లో జరిగిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై(Chennai)లోని కిల్ పక్ ప్రాంతంలోని ఓ రోడ్డుపై పలని అనే వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఓ కారు(Car) అకస్మాత్తుగా అదుపుతప్పింది.
అది కాస్తా పలనిపైకి దూసుకెళ్లింది. ప్రమాద ధాటికి పలని గాల్లోకి ఎగిరి కింది పడ్డాడు. ఏం జరిగిందో చూసేలోపే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు అనంతరం అలాగే వెళ్తూ ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ జయకుమార్ గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.