Baby Girl: ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లి ఆ పసికందును ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2023-04-27T07:58:16+05:30 IST

ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ మాతృమూర్తి ఆ పసికందును చెరువులో పడేసిన ఘటన...

Baby Girl: ఆడపిల్ల పుట్టిందని కన్నతల్లి ఆ పసికందును ఏం చేసిందంటే...
Assam Woman Throws Baby Girl

సోనిత్‌పూర్ (అసోం): ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ మాతృమూర్తి ఆ పసికందును చెరువులో పడేసిన ఘటన అసోం రాష్ట్రంలో వెలుగుచూసింది. (Baby Girl)అసోంలోని సోనిత్‌పూర్ జిల్లాలో ఓ తల్లి తన పసికందును చెరువులో(Pond) పడేసి హతమార్చింది.(Assam Woman Throws) అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని సోనిత్‌పూర్ జిల్లాలోని బిస్వనాథ్ సబ్ డివిజన్ పరిధిలోని మహాలక్ష్మి బస్తీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.పోలీసులు కథనం ప్రకారం...ఏప్రిల్ 24వతేదీన తల్లి తన బిడ్డను చెరువులో పడేసింది. బుధవారం పాప మృతదేహం చెరువులో తేలుతుండడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి :ATM Baba: ఏటీఎంలను పగలగొట్టడంలో ఈ బీహార్ బాబా శిక్షణ తరగతులు...ఆపై ఆ దొంగలు ఏం చేశారంటే...

పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తల్లిదండ్రులను తీసుకువచ్చి అరెస్ట్ (Arrest) చేశారు.జ్యోత్స్నా ఖండ్వాల్ అనే తల్లి తన బిడ్డను ఏప్రిల్ 24వతేదీ రాత్రి తన ఇంటి సమీపంలోని చెరువులో పడేసిందని బిస్వనాథ్ చారియాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి ఎస్ హజోవరీ చెప్పారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తల్లి జ్యోత్సా ఖండ్వాల్ ను విచారించగా ఆమె నేరం చేసినట్లు అంగీకరించింది.

Updated Date - 2023-04-27T07:59:08+05:30 IST