Air India: ఇజ్రాయెల్ - హమాస్ వివాదం.. విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా.. ఎప్పటివరకంటే?

ABN , First Publish Date - 2023-10-08T14:52:59+05:30 IST

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి ఇజ్రాయిల్‌(Israel)లోని టెల్ అవీవ్(Tel Aviv) పట్టణానికి వెళ్లే విమానాలను రద్దు చేసింది.

Air India: ఇజ్రాయెల్ - హమాస్ వివాదం.. విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా.. ఎప్పటివరకంటే?

ఢిల్లీ: ఇజ్రాయెల్ - హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా(Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి ఇజ్రాయిల్‌(Israel)లోని టెల్ అవీవ్(Tel Aviv) పట్టణానికి వెళ్లే విమానాలను రద్దు చేసింది. అక్టోబర్ 14 వరకు ఫ్లైట్స్ ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా దేశ రాజధాని నుంచి టెల్ అవీవ్‌కు వారానికి ఐదు విమానాలు నడుపుతోంది. ఇజ్రాయిల్ పై హమాస్(Hamas) మిలిటెంట్లు శనివారం నుంచి దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ సైతం దీనికి ప్రతి దాడులు చేస్తోంది. రెండు వైపుల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇప్పటికే 600 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత కోసం టెల్ అవీవ్ కు వెళ్లే విమానాల్ని రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.


ఇజ్రాయిల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ చేసిన దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం వరకు రెండు వైపుల మృతుల సంఖ్య 600కు చేరింది. శనివారం ఉదయం నుంచి ఈ ఘర్షణలు జరుగుతుండగా.. పరస్పర దాడుల్లో ఆయా ప్రాంతాలు తీరని ఆస్తి, ప్రాణ నష్టాన్ని చవి చూస్తున్నాయి. ఇజ్రాయిల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర పోరు ఇంకా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం, స్డెరోట్, కిబ్బట్జ్ నిర్ యామ్ వంటి ప్రాంతాల్లో రాకెట్ సైరన్‌లు మోగిస్తున్నారు.

Updated Date - 2023-10-08T14:52:59+05:30 IST