Hindenburg report: అదానీ సంక్షోభంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్

ABN , First Publish Date - 2023-02-02T12:01:43+05:30 IST

అదానీ గ్రూప్ బాగోతంపై హిండెన్ బర్గ్ నివేదికపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్...

Hindenburg report: అదానీ సంక్షోభంపై చర్చకు ప్రతిపక్షాల డిమాండ్
Adani crisis Opposition demands discussion

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ బాగోతంపై హిండెన్ బర్గ్ నివేదికపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్(Congress MP Manickam Tagore) గురువారం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.(Hindenburg report) అదానీ అదానీ స్టాక్ క్రాష్‌పై సీపీఐకి చెందిన బినోయ్ విశ్వన్ రాజ్యసభలో ఇచ్చిన బిజినెస్ నోటీసును సస్పెండ్ చేశారు.అదానీ స్టాక్ క్రాష్‌పై అత్యవసరంగా చర్చించాలని సీపీఐకి చెందిన బినోయ్ విశ్వన్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ బాగోతంపై అమెరికా ఆధారిత పెట్టుబడి పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇది కూడా చదవండి : WhatsApp: భారతదేశంలో 36.77 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధాస్త్రం

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో ఈ అంశంపై చర్చించాలని పలువురు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మారింది.అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని లోక్‌సభ ఎంపీ మనీష్ తివారీ కోరారు.అదానీ కుంభకోణంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కాంగ్రెస్, డీఎంకె, టీఎంసి, ఎస్‌పి, జేడీయు, శివసేన (యుబిటి), సీపీఎం,సీపీఐ, ఎన్‌సిపి, ఐయుఎంఎల్, ఎన్‌సి ఆప్, కేరళ కాంగ్రెస్ అదానీ ‘స్కామ్’పై పార్లమెంటులో చర్చను కోరాయి.

Updated Date - 2023-02-02T12:02:22+05:30 IST