Delhi: హెల్మెట్ ధరించి.. తుపాకులతో బెదిరించి.. ఢిల్లీలో పట్ట పగలు నగల దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2023-09-29T09:25:51+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పట్టపగలు తుపాకులతో బెదిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమయ్ పుర్ బద్లీలో శ్రీ రామ్ జ్యువెలర్స్ షాపు(Jewellers Shop) ఉంది. బుధవారం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులతో మధ్యాహ్నం 1.30కి షాపులోకి ఎంటర్ అయ్యారు.

Delhi: హెల్మెట్ ధరించి.. తుపాకులతో బెదిరించి.. ఢిల్లీలో పట్ట పగలు నగల దుకాణంలో చోరీ

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో పట్టపగలు తుపాకులతో బెదిరించి దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన తాలూకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమయ్ పుర్ బద్లీలో శ్రీ రామ్ జ్యువెలర్స్ షాపు(Jewellers Shop) ఉంది. బుధవారం గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకుని, తుపాకులతో మధ్యాహ్నం 1.30కి షాపులోకి ఎంటర్ అయ్యారు.


అనంతరం తుపాకులతో షాపు యజమానిని బెదిరిస్తూ నగలను బ్యాగ్ లో సర్దమని సూచించారు. 2 నిమిషాల్లో దొరికిన నగల్ని మూట కట్టుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. 480 గ్రాముల నగలు చోరీకీ గురయ్యాయని, వాటి విలువ రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీకి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దుండగులు బైక్ పై పరారయ్యారు. జంగ్ పురా ప్రాంతంలో జరిగిన దోపిడీ మరుసటి రోజే ఈ చోరీ జరగటం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-29T09:25:51+05:30 IST