UGC కీలక నిర్ణయం! ఇకపై విద్యాసంస్థల్లో తప్పనిసరి చేస్తూ..!

ABN , First Publish Date - 2023-02-18T12:40:02+05:30 IST

వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ (UGC) తాజాగా లేఖ రాసింది. పాఠ్యపుస్తకాలు (Textbooks) కూడా

UGC కీలక నిర్ణయం! ఇకపై విద్యాసంస్థల్లో తప్పనిసరి చేస్తూ..!
ఇకపై ఈ భాషల్లోనే..

పుస్తకాలు సైతం మాతృభాషలో ముద్రించాలి: యూజీసీ

న్యూఢిల్లీ: ఉన్నత విద్యాసంస్థల్లో (Higher education institution) (హెచ్‌ఈఐ) బోధనను స్థానిక భాషల్లోనే (Local language) ఉండేలా చూడాలని వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు యూజీసీ (UGC) తాజాగా లేఖ రాసింది. పాఠ్యపుస్తకాలు (Textbooks) కూడా మాతృభాషల్లో ఉండాలని సంస్థ చైర్మన్‌ ఎం జగదీశ్‌ కుమార్‌ ఆ లేఖలో సూచించారు. ‘‘భారతీయ భాషల్లో విద్యాబోధన అనేది జాతీయ విద్యావిధానం (National Education Policy) (ఎన్‌ఈపీ)-2020లో కీలక భాగం. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కళాశాలలు, వర్సిటీల్లో పలు రకాలైన అంశాలను మాతృభాషలోనే బోధిస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి చదువుకునే వారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఇతర భాషల్లోని మంచి పుస్తకాలను కూడా స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి విద్యార్థులకు చేరువయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది’’ అని కుమార్‌ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

Updated Date - 2023-02-18T12:41:41+05:30 IST