ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నోటిఫికేషన్
ABN , First Publish Date - 2023-05-13T13:59:20+05:30 IST
ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూఎస్ఐబీ)- మూడేళ్ల బీబీఏ, అయిదేళ్ల బీబీఏ+ఎంబీఏ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి
ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూఎస్ఐబీ)- మూడేళ్ల బీబీఏ, అయిదేళ్ల బీబీఏ+ఎంబీఏ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్లకు విశాఖ ఐఐఎం సహకారం అందిస్తోంది. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో మొదటి మూడేళ్ల తరవాత కోర్సు నుంచి వైదొలగే వీలుంది. వీరికి బీబీఏ డిగ్రీ ఇస్తారు. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. మొత్తం 120 సీట్లు ఉన్నాయి.
బీబీఏ+ఎంబీఏ వివరాలు
ప్రోగ్రామ్లో భాగంగా ఫౌండేషన్ కోర్సులు, కోర్ కోర్సులు, ఎలక్టివ్ కోర్సులు, ప్రాక్టికల్ ట్రెయినింగ్, కేస్ స్టడీస్, విదేశీ ప్రొఫెసర్ల ఆన్లైన్ లెక్చర్స్, ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి. ఏటా కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుంది.
క్రియేటివిటీ, ఇన్నోవేషన్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్, టీంవర్క్, బిజినెస్ ఎథిక్స్, స్ట్రాటజిక్ అనాలిసిస్, లైఫ్ స్కిల్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.
స్పెషలైజేషన్లు: మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్తో ద్వితీయశ్రేణి మార్కులతో ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1200; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000
దరఖాస్తుకు చివరి తేదీ: మే 15
గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు: మే 16 నుంచి 18 వరకు
సీట్ల కేటాయింపు: మే 18
చిరునామా: డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెద వాల్తేర్, విశాఖపట్నం-530017
వెబ్సైట్: audoa.in