EAMCET: ఎంసెట్ ఫలితాల అనంతరం విడుదలకానున్న..!
ABN , First Publish Date - 2023-05-24T11:36:11+05:30 IST
ఎంసెట్ ఫలితాల అనంతరం ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ను

రేపు ఎంసెట్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబిత
ఎంసెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులు https://eamcet.tsche.ac.in అనే వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల్లో భాగంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలకు వేర్వేరు ర్యాంకులు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేయడంతో ఎంసెట్లో వచ్చే మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించనున్నారు. వీటి ఆధారంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ చేస్తారు. ఎంసెట్ ఫలితాల అనంతరం ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేయనున్నారు.