సాయంత్రం 5 గంటలకు ఇంటర్‌ ఫలితాలు

ABN , First Publish Date - 2023-04-26T12:45:44+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి

సాయంత్రం 5 గంటలకు ఇంటర్‌ ఫలితాలు
Inter results

విడుదల చేయనున్న మంత్రి బొత్స

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు https://examresults.ap.nic.in, www.bie. ap.gov.inలో అందుబాటులో ఉంచుతామన్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు నిర్వహించిన పరీక్షలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సుమారు 10 లక్షల మంది హాజరయ్యారు.

Updated Date - 2023-04-26T12:45:44+05:30 IST