వివాహిత ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది...
ABN , First Publish Date - 2023-03-25T11:17:27+05:30 IST
ఓ వివాహిత ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది....
మీరట్ (ఉత్తరప్రదేశ్): ఓ వివాహిత ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కన్న పిల్లల్ని హతమార్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో వెలుగుచూసింది.(Woman Kills Minor Son, Daughter) మీరట్(Meerut) నగరానికి చెందిన ఓ వివాహితకు పదేళ్ల వయసు గల కుమారుడు, ఆరేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. వివాహిత స్థానిక కౌన్సిలర్ తో ఏర్పడిన పరిచయంతో అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రియుడి(Lover) సహాయంతో వివాహిత తన కొడుకు, కుమార్తెను హతమార్చి వారి మృతదేహాలను కాల్వలో పడేసింది.అనంతరం పిల్లలిద్దరూ తప్పిపోయారని తల్లి ఫిర్యాదు చేసిందని ఎస్పీ పీయూష్ సింగ్ చెప్పారు. ఈ పిల్లల హత్య కేసులో మరికొందరు ఇరుగుపొరుగువారి ప్రమేయం కూడా ఉందని పోలీసులు చెప్పారు.కాల్వలో నుంచి చిన్నారుల మృతదేహాలు వెలికితీయాల్సి ఉంది. ఈ హత్య కేసులో నిందితులైన తల్లితోపాటు ప్రియుడు, సహకరించిన వారిని అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు.